Home » Odisha
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra 2024) ఈరోజు కాసేపట్లో మొదలు కానుంది. ఈ క్రమంలో గంటగంటకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆ దివ్య క్షణం కోసం అంతా వేచిచూస్తున్నారు. సింహద్వారం వద్ద స్వామివారి కోసం రథాలు వేచి ఉన్నాయి. ఈ ఏడాది రెండు రోజుల పాటు భక్తులకు రథాలు లాగే భాగ్యం కలగనుంది.
ఒడిసాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది.
ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్రిజర్వ్డ్ ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్కోస్ట్ రైల్వేశాఖ నిర్ణయించింది.
గూగుల్ మ్యాప్ను నమ్ముకుని.. గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో.. ఇటీవల చాలా సంఘటనల్లో మనం చూశాం. ఈ గూగుల్ మ్యాప్ను నమ్ముకొని సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఆశావహులు.. మరో పరీక్ష కేంద్రానికి వెళ్లారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్తో హై-స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) 'అభ్యాస్' డెవలప్మెంటల్ ట్రయల్స్ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది.
బీజేపీకి ఇక మద్దతిచ్చే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టంచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
గతంలో బీజేపీ, ఒడిశాలోని బీజేడీ పార్టీలు సహజీవనం చేశాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బీజేడీతో సంబంధాలు తెంపుకొని.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే రంగంలోకి..
తెలంగాణలో కేసీఆర్ రెండు చోట్ల(గజ్వేల్, కామారెడ్డి) పోటీ చేసిన మాదిరిగానే, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా రెండు స్థానాల్లో(హింజిలీ, కాంతాబంజీ) పోటీ చేశారు. అయితే సిట్టింగ్ స్థానం హింజిలీలో నవీన్ గెలుపొందారు. కానీ కాంతాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్పై 16,334 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
బక్రీద్ పర్వదినం సందర్బంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత అర్థరాత్రి నుంచి పట్టణంలో పోలీసులు కర్ప్యూ విధించారు.
ఒడిసా నుంచి హైదరాబాద్కు గుట్టుగా గంజాయి తరలిస్తున్న రెండు అంతర్రాష్ట ముఠాలకు చెందిన ఆరుగురిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 164 కిలోల గంజాయి, మూడు కార్లు, ఓ బైక్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.