Home » Odisha
ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. అయితే గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్న భండార్ని తెరిచారు. ఇందులోని(Ratna Bhandar) ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు.
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం లోపలి గదిలో విలువైన లోహాలతో రూపొందించిన పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది.
పూరీ క్షేత్రంలోని 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఖజానా రత్నభాండాగారం 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది. గది లోపల ఉన్న విలువైన వస్తువుల లెక్కింపుతో పాటు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణానికి మరమ్మతులు చేయడానికి ఖజానాను తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.
పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని(Puri Ratna Bhandar) ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా బయటకి తీసుకువచ్చింది. బయటకి తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు.
పూరీ జగన్నాథ స్వామి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆధివారం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మరికాసేపట్లో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు.
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రం పూరీ క్షేత్ర రత్నభాండాగారం మరి కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది.
ఒడిశాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రానికే చెందిన మరో 15మందికి గాయాలయ్యాయి.
ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం(Jagannath's Ratna Bhandar) రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ రహస్య గదిలోని ఖజానాను బయటి ప్రపంచానికి చూపించనున్నారు. 46 ఏళ్ల తరువాత ఆ గది తెరవబోతుండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావించి తెరవడానికి జంకుతున్నారు.
జగన్నాథుడి రథ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ సత్సంగ్ యాత్ర తొక్కిసలాట ఘటన మరువక ముందే.. జగన్నాథుడి రథ యాత్రలో తొక్కిసలాట(Stampede in Jagannath Puri Rath Yatra) జరిగింది.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కనులపండువగా జరుగుతోంది. ఒడిశాతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూరీ ఆలయానికి తరలివస్తున్నారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ విధులన్నీ మార్మోగుతున్నాయి.