Home » Odisha
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన బిజూ జనతాదళ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత మమత మోహంతా తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖఢ్ ఆమోదించారు.
గనులపై, ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే రాయల్టీ.. పన్ను కాదని తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్పై బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై ఆయన పెదవి విరిచారు.
పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే పథకాల పేర్లు మారుతాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే పురస్కారాలు పేర్లు సైతం మారిపోతాయి. ఒడిశాలో తాజాగా అదే జరిగింది. గత నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు అందజేసేది.
ఒడిశాలో సంచలనం రేపిన మహిళ పుర్రెలో సూదుల ఘటనలో బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం అయింది. బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లోని వైద్యులు యువతి పుర్రెలోంచి మొత్తం 77 సూదులను తొలగించారు.
నారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మబలికిన ఓ తాంత్రికుడు.. 19 ఏళ్ల యువతి ప్రాణాలతో చెలగాటమాడాడు. వైద్యం పేరిట ఆ యువతి తలలో ఏకంగా 70 సూదులు గుచ్చేశాడు.
కాంగ్రెస్ పార్టీ 'రాజకీయ పరాన్నజీవి'గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇతర పార్టీల బలంపై ఆధారపడటం, ఇతర పార్టీల సహకారంతో, 'కూటమి' ఓట్లతో ఉనికి కాపాడుకుంటోందని విమర్శించారు. ఒడిశాలోని పూరీలో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివివ్ కమిటీ సమావేశంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. అయితే గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్న భండార్ని తెరిచారు. ఇందులోని(Ratna Bhandar) ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు.
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం లోపలి గదిలో విలువైన లోహాలతో రూపొందించిన పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది.
పూరీ క్షేత్రంలోని 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఖజానా రత్నభాండాగారం 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది. గది లోపల ఉన్న విలువైన వస్తువుల లెక్కింపుతో పాటు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణానికి మరమ్మతులు చేయడానికి ఖజానాను తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.