Home » Odisha train accident
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడి కటక్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండామని భరోసా ఇచ్చారు. వారికి అందుతున్న వైద్యసహాయాన్ని మంత్రులు, అధికారులతో కలిసి స్యయంగా సమీక్షించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 80 మంది ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు
ఒడిశాలో కనీవినీ ఎరుగని మహా విషాదం చోటుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలిని శనివారంనాడు సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తు్న్న కేంద్రం మంత్రులు, రైల్వే అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా జరుగుతున్న సహాయక ఏర్పాట్లను పర్వవేక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పరిస్థితిని సమీక్షించారు.
దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ‘ఒడిశా రైలు ప్రమాదం’ (Odisha rail Accident) ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని తేలింది.