Home » NTR District
భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.
ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలం, తుర్లపాడు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం దాడులకు దారితీసింది. పాత గొడవలు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కర్రలు, గోడ్డళ్లతో దాడుదలకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు.
భవిష్యత్కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
జిల్లాలోని విస్సన్నపేటలో 2200 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో ఇద్దరు వ్యక్తలు దర్జాగా బైక్పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు... దాని విలువ రూ. 42 వేలు. వివరాల్లోకి వెళితే..
నందిగామ పురపాలక సంఘంలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ చట్టంలోని రిక్విజేషన్ పేరుతో సమావేశం ఏర్పాటు వివాదానికి కారణంగా నిలిచింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహిళనని చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రతిసారీ అవమాన పరుస్తున్నారన్నారంటూ కంటతడిపెట్టారు.
అవును.. ఏపీ మంత్రి విడదల రజనీ (Minister Vidadala Rajani) శాఖ మారిపోయిందోచ్..! వైద్య ఆరోగ్యశాఖ (Minister for Health, Family Welfare) కాస్త హోం శాఖగా మారిపోయింది..!
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.
జిల్లాలోని జి. కొండూరు మండలం వెల్లటూరులో బొడ్డు బాలయ్య (30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ వైన్షాప్కు 200 మీటర్ల దూరంలో బాలయ్య మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.