Home » Nominations
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ (Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. బీహార్(BIHAR)లో మాత్రం నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్కి చెందిన వినయ్ చక్రవర్తి లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నామినేషన్ ఫారమ్ని పొందేందుకు కలెక్టరేట్కి వెళ్లారు. రూ.25 వేలను కాయిన్స్ రూపంలో డిపాజిట్ చేశాడు. ఆయన పనికి కలెక్టరేట్ సిబ్బంది షాక్కి గురయ్యారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను మంగళవారంనాడు ఆయన దాఖలు చేశారు. ఎన్డీయేకు చెందిన పలువురు సీనియర్ నేతలు నితీష్ వెంట ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పాకిస్తాన్ నేషనల్ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన దాఖలు చేసిన రెండు నామినేషన్లను తిరస్కరించింది.
తెలంగాణలో నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో ఆ పార్టీ అధిష్టానం సక్సెస్ అయ్యింది. ఎట్టకేలకు రెబల్ నేతలను హస్తం పార్టీ దారిలోకి తెచ్చుకుంది.
సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై సస్పెన్స్ వీడింది. సూర్యాపేటలో పోటీ నుంచి తప్పుకునేందుకు పటేల్ రమేష్రెడ్డి అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి బుజ్జగింపులు ఫలించాయి.
Telangana Elections: సూర్యాపేటలోని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో రెండు గంటలకు పైగా సీనియర్ కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. భవిష్యత్పై అధిష్టానం నుంచి హామీలు ఇచ్చేలా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Nomination Day : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. శుక్రవారం నాడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. అయితే గురువారం మంచి రోజు కావడంతో నామినేషన్లు వేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా క్యూ కట్టారు...