• Home » Nominations

Nominations

Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పశ్చిమ తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని సుజనా.. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’’ అని తెలిపారు.

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..

Lokesh Nomination: లోకేష్ నామినేషన్ పత్రాలతో కూటమి నేతల పూజలు.. తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు

Lokesh Nomination: లోకేష్ నామినేషన్ పత్రాలతో కూటమి నేతల పూజలు.. తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు

Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. దీంతో పలువురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు కుప్పం బాటలోనే మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్‌ వెళ్లనున్నారు. లోకేష్ తరపున స్థానిక నేతలు నామినేషన్ వేయనున్నాను. లోకేష్ నామినేషన్‌తో మంగళగిరిలో సందడి వాతావరణం నెలకొంది.

Elections 2024: నామినేషన్ల పర్వంలో పోలీసుల అత్యుత్సాహం.. మీడియాకూ నో ఎంట్రీ..

Elections 2024: నామినేషన్ల పర్వంలో పోలీసుల అత్యుత్సాహం.. మీడియాకూ నో ఎంట్రీ..

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పలు చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

AP Elections: ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల... మొదలైన నామినేషన్ల ప్రక్రియ

AP Elections: ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల... మొదలైన నామినేషన్ల ప్రక్రియ

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం మొదలైంది. కాసేపటి క్రితమే ఏపీలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకూ నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది.

AP Elections: నామినేషన్‌కు భారీ ర్యాలీగా వెళ్తున్న సుజనా చౌదరి

AP Elections: నామినేషన్‌కు భారీ ర్యాలీగా వెళ్తున్న సుజనా చౌదరి

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కాసేపట్లో మొదలుకానుంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. ఈరోజు మంచి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈరోజు ఉదయం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం చిట్టినగర్‌లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..

KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..

Andhrapradesh: గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా..ఆంధ్రను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.

AP Elections: టీడీపీ చీఫ్ చంద్రబాబు నామినేషన్ వేసేది ఎప్పుడో తెలుసా..!

AP Elections: టీడీపీ చీఫ్ చంద్రబాబు నామినేషన్ వేసేది ఎప్పుడో తెలుసా..!

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఏపీలో ఈసారి ఎవరికి అధికారం దక్కనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఏపీలో రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.

Rahul Gandhi: వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్..

Rahul Gandhi: వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్..

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు.

Delhi: వయనాడ్ నుంచి రాహుల్ లోకసభ నామినేషన్ నేడు..

Delhi: వయనాడ్ నుంచి రాహుల్ లోకసభ నామినేషన్ నేడు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్ సభ సమరానికి సిద్ధం అయ్యారు. బుధవారం ఆయన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేయనున్నారు. ఇది ఆయన ఎన్నికల ప్రయాణంలో కీలకమైన ముందడుగు. నామినేషన్ సమర్పణకు ముందు రాహుల్.. కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి