Home » Nizamabad
ఇరవై ఏళ్ల తర్వాతో... ముప్పై ఏళ్ల తర్వాతో పూర్వ విద్యార్థులు కలుసుకుంటే అదే అద్భుతం అంటారు! మరి.. ఏకంగా 64 ఏళ్ల తర్వాత ఓ బ్యాచ్ సమావేశమైతే దాన్ని ఏ మాటలతో వర్ణించగలం?
రాష్ట్రంలోని ప్రజలందరికీ పైపులైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన పథకం.. మిషన్ భగీరథ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా...
చాలా కాలం తర్వాత నిజామాబాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వస్తున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలు తిహార్ జైలులో ఉన్న అనంతరం మొదటి సారి జిల్లాకు వస్తున్నారు. డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘనస్వా గతం పలుకుతారు. బై పాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్, ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
Telangana: కామారెడ్డిలో ఇద్దరు పోలీసులు, ఓ యువకుడి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురి బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాను వైద్యసేవల హబ్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. డీఎస్పీ మదనం గంగాధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఉద్యోగం ద్వారా కంటే.. రాజకీయంగా సేవ చేసేందుకు మరింత అవకాశం ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.
దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల నక్షత్రం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల నక్షత్రం వస్తుందని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్.వి.దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.