Home » Nitish Kumar
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)తో తిరిగి చెలిమికి ఆర్జేడీ మంతనాలు సాగిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్జేడీ నేత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆదివారంనాడు ఘాటు సమాధానం ఇచ్చారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సపోర్ట్తో ముఖ్యమంత్రి స్థాయికి నితీష్ కుమార్ ఎదిగారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్కు అనుగుణంగా కేంద్రంలో నితీష్ పొత్తు సాగిస్తున్నారని సమ్రాట్ చౌదరి చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సంచలన జోస్యం చెప్పారు.
బీహార్లో 58 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు యువకులేనని, రెక్కలు అలిసిపోయిన రిటైర్డ్ సీఎం ఈ రాష్ట్రానికి అవసరం లేదని పరోక్షంగా నితీష్పై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
నితీష్ కుమార్ ప్రసంగిస్తుండగా తేజస్వి అడ్డుపడటంతో ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తన వల్లే లాలూ ప్రసాద్ రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారంటూ నితీష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తన తండ్రి 100 శాతం ఫిట్గా ఉన్నారని, ఆయనకు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు నిశాంత్ కుమార్ ఇటీవల చేసిన విజ్ఞప్తిపై తేజస్వి మాట్లాడుతూ, ఆయన తండ్రి కంటే మా తండ్రి (లాలూ ప్రసాద్ యాదవ్) మంచి ఫిట్నెస్తో ఉన్నారని చమత్కరించారు.
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ (JDU) మణిపూర్ రాష్ట్ర విభాగం ప్రకటించడం సంచలనమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం స్పందించింది
నితీష్ జనతాదళ్, లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ గతంలో మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్నారు. అయితే విభేదాల కారణంగా కొద్దికాల క్రితం మహాకూటమికి నితీష్ ఉద్వాసన చెప్పారు.
Bihar Politics: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. అలాంటి వేళ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
నితీష్ కుమార్ మరోసారి కూటమి మారే అవకాశాలపై శనివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తేజస్విని మీడియా ప్రశ్నించినప్పుడు అలాంటి ఊహాగానాలకు తన వద్ద ఆధారాలేమీ లేవన్నారు.