Home » Nitish Kumar
విపక్ష కూటమిలో అసంతృప్తులను శాంతపరచడం ద్వారా రాహుల్ గాంధీ చేపట్టనున్న ''భారత్ న్యాయ్ యాత్ర'' కు లైన్ క్లియర్ చేసేందుకు ''ఇండియా'' కూటమి కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి కోఆర్డినేటర్ గా నియమించే అవకాశం ఉంది.
జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
లోక్ సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు వేగం పెంచారు. కూటమిలో కీలకమైన కన్వీనర్ పోస్ట్ ని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ నాయకత్వానికి ఇప్పటికే పలువురు నేతలు సమ్మతి తెలిపారు.
విపక్ష ఇండియా కూటమిపై జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాల నడుమ కూటమి వర్చువల్ మీట్ ఈనెల 3న జరుగనుంది. ఈ సమావేశంలో నితీష్ కుమార్ పేరును కూటమి కన్వీనర్గా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపాదించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా బ్లాక్లో తొలి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కూటమిలో కీలక బాధ్యతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమర్ కు అప్పగించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం వరకూ కూటమి తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత ఆస్తుల విషయంలో తన డిప్యూటీ తేజస్వి యాదవ్ కంటే వెనుకబడ్డారు. ప్రతి సంవత్సరం చివరిరోజున సీఎం సహా కేబినెట్ మంత్రులంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి. ఆ ప్రకారం సీఎం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వద్ద రూ.22,552 నగదు ఉండగా, రూ.49,202 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.
జనతాదళ్ యునైటెడ్ అధ్యక్ష పగ్గాలను తిరిగి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన చేతుల్లోకి తీసుకున్నారు. బీహార్ అధికార జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ శుక్రవారంనాడిక్కడ జరిగిన పార్టీ జాతీయ ఎక్సిక్యూటివ్ సమాశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు.
‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఎప్పటినుంచో మిస్టరీగానే ఉంది. అయితే.. ఇటీవల జరిగిన ఇండియా కూటమి నాల్గవ సమావేశంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రతిపాదన...
బీహార్లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు నేతలు ఇటీవల ప్రతిపాదించడంపై కూటమిలో చీలక ఏర్పడవచ్చనే ఊహాగానాలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తెరదించే ప్రయత్నం చేశారు. కూటమిలో పోస్ట్ కోసం తాను ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.