Home » Nitish Kumar
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన అనిశ్చితికి మరి కొద్ది గంటల్లోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార మహాకూటమితో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ తెగతెంపులు చేసుకుని బీజేపీ మద్దతుతో అధికారం కొనసాగించే ఆలోచనలో ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్జేడీ కసరత్తు మొదలుపెట్టింది.
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన అనిశ్చితి ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకుంది. మహాఘట్బంధన్కు సీఎం నితీష్ కుమార్ గుడ్బై చెప్పనున్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రభుత్వాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ నితీష్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం పాట్నాలోని రాజ్భవన్ చేరుకున్నారు.
బీహార్లో నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నిట్టనిలువుగా చీలనుందా? జేడీయూ, ఆర్జేడీ మధ్య తలెత్తిన లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయా? కమలనాథులతో తిరిగి నితీష్ జేడీయూ పొత్తు పెట్టుకుని అధికారం కొనసాగించనుందా? అవుననే స్పష్టమైన కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.
బీహార్లోని అధికార మహాకూటమి మనుగడ చర్చనీయాంశమవుతున్న తరుణంలో ఇంకెంతోకాలం కూటమి మనుగడ సాగించదని కూటమి మాజీ భాగస్వామి, హిందూస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ జోస్యం చెప్పారు.
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు రాబోతోందా? ఎమ్మెల్యేలంతా పాట్నాకు రావాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించడం వెనకున్న కారణం ఏంటి? అంటే నితీష్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అవును.. నితీష్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారట. సీఎం పదవికి రాజీనామా చేసి.. అసెంబ్లీని కూడా రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేస్తారని జేడీయూ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.
విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
బిహార్లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.
బీహార్ రాజకీయాల్లో మరోసారి అలజడి చోటుచేసుకోనుందా? జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా గవర్నర్ను మంగళవారంనాడు కలుసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఆర్జేడీకి ఉద్వాసన చెప్పి బీజేపీతో చేతులు కలిపే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి కన్వీనర్గా వ్యవహరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరాకరించారు. ఈ పదవిని కాంగ్రెస్కు చెందిన వేరెవరికైనా అప్పగించాలని నితీష్ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఇండియా' కూటమి వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది.
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరవుతారా లేదా అనే విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే 'ఇండియా' కూటమి ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అగ్రనేతలైన సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి వెళ్లడం లేదని ప్రకటించింది.