Home » Nirmala Sitharaman.
2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బుధవారంనాడు బాధ్యతలు చేపట్టారు. మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు.
తన వద్ద డబ్బులు లేకపోవడం వలన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైన అంశంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) సైతం డబ్బులు లేకపోవడం వలనే తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు.
ప్రజా సమస్యలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నేతలు అప్పుడప్పుడు తమ కోసం కొన్ని చిన్న చిన్న పనులు చేస్తుంటారు. పదవి, హోదాను మరిచి సాధారణ ప్రజల్లా వ్యవహరిస్తుంటారు. గల్లీ నేతల నుంచి దిల్లీ నాయకుల వరకు తమకు ఎప్పుడైనా కాస్త విరామ సమయం దొరికితే చాలు..