Home » Nirmal
నిర్మల్ జిల్లా: అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్లోని కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతుండడంతో పిల్లలను తల్లిదండ్రులు వారి ఇళ్లకు తీసుకువెళుతున్నారు.
‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతున్న మాటలివి.
పచ్చని ప్రకృతి.. పిల్లగాలులు.. సెలయేళ్లు, వాటర్ఫాల్స్ మధ్య వన్య ప్రాణులను చూస్తూ గడిపితే ఆ ప్రశాంతతే వేరు! దీనికి ఆధ్యాత్మిక వాతావరణం తోడైతే గనక అక్కడి నుంచి కదలబుద్దేయదు! మరికొంత సమయం గడిపితే బాగుణ్ను అని అనిపిస్తుంది.
జీవో 510తో తనలాంటి ఒప్పంద ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ వకుళాభరణం భరత్కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్లో సోమవారం జరిగిందీ విషాదం.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడింది. దీంతో వాహనదారులు పులిని సెల్ ఫోన్లతో ఫోటోలు తీసారు. ఈ క్రమంలో అటవీ అధికారులు దిమ్మదుర్తి సుర్జాపూర్, మాస్కాపూర్, ఎక్బాల్ పూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. పెట్రోలులో కలిపేందుకు ఇథనాల్ తయారీ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో పీఎంకే డిస్టిలేషన్కు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు.
నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఆ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయడమో, తరలించడమో చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మహాధర్నాను విరమిస్తున్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. తాత్కాలికంగా ఆందోళన విరమిస్తునట్టు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ నేతలు ప్రకటించారు. కలెక్టరేట్ లో జేఏసీ..
కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా అది ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.