Home » Nimmala Rama Naidu
తుంగభద్రకు యుద్ధప్రాతిపదికన గేట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) తెలిపారు. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశాలతో తుంగభద్ర డ్యామ్ కొత్త గేటు ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్కు సంబంధించి 19వ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయిందని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా కూడా ఉండటానికి అర్హత లేదని ప్రజలు జగన్కు ప్రజా తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటికి ఆయన పద్ధతిలో మార్పు రావడం లేదని విమర్శించారు.
జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక శాతం కేటాయించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సరైన ఆహారం, మంచినీరు, విద్యుత్ సదుపాయం లేక ప్రజలు తీవ్రఅవస్థలు పడతున్నారు. పంటలు నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఏపీలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపై రాష్ట్రంలో భారీగా వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న..
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.
అమ్మకు వందనం (Ammaku vandanam) పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్(Press Council)కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు.
Andhrapradesh: వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా ‘‘తల్లికి వందనం’’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.