Home » Nimmala Rama Naidu
గత 5 ఐదేళ్లలో వైసీపీ పాలకుల తప్పులు, పాపాలకు మనం బాదితులమయ్యామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదట్నుంచీ అలవాటేనని విమర్శలు చేశారు.
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధింత అధికారులతో సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలపై అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభలో పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని లేకపోయినా ప్రతీ ఒక్కరిపై రూ. 2.50 లక్షల అప్పు ఉందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాల సాక్ష్యాలను తెరమగురు చేసే ప్రయత్నం ప్రతి శాఖలోనూ జరుగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు.
పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ తాత్కాలిక గేటు బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు, మూడవ ఎలిమెంట్లు ఇంజనీర్లు అమర్చుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60x4 మొదటి బిట్ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు.