Home » Nimmala Rama Naidu
కూటమి సర్కార్.. అనుకున్నది సాధించింది. వరదలతో బెజవాడ ప్రజలను గజ గజ వణికించిన బుడమేరు పనులు విజయవంతంగా ముగిసాయి...
బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.
Andhrapradesh: బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు.
అమరావతి: విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడుస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు.
గత 5 ఐదేళ్లలో వైసీపీ పాలకుల తప్పులు, పాపాలకు మనం బాదితులమయ్యామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదట్నుంచీ అలవాటేనని విమర్శలు చేశారు.
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధింత అధికారులతో సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలపై అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభలో పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని లేకపోయినా ప్రతీ ఒక్కరిపై రూ. 2.50 లక్షల అప్పు ఉందని అన్నారు.