Home » Nimmala Rama Naidu
ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
జగన్ ఐదేళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ పాలనలో డిస్కంలపై రూ. 18 వేల కోట్లు బకాయిల భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
రాష్ట్రంలో అన్ని లిఫ్ట్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్కు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
Andhrapradesh: పోలవరం, వెలిగొండ, చింతలపూడి,గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజనీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి (బుధవారం) నుంచి పోలవరం ఢయా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి
పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ని తాడిపర్రులో ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిస్కరించడంలో ఘోరంగా విఫలం అయందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట పేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.