Home » Nifty
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డు సృష్టించగా, నేడు(శుక్రవారం) మాత్రం భారీగా పతనమైంది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.50 గంటల నాటికి సెన్సెక్స్ 890 పాయింట్ల నష్టపోయి 80,977 పరిధిలో ఉండగా, నిఫ్టీ 50 సూచీ 288 పాయింట్లు కోల్పోయి 24,722 స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 3 సంవత్సరాల పాటు భారతీయ సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధించింది. దీంతో మాల్యా 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నేడు శుక్రవారం (జులై 27న) వారం చివరి ట్రేడింగ్ సెషన్లో సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 80,158 వద్ద, నిఫ్టీ 50 కూడా 17 పాయింట్లు పెరిగి 24,423 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్(sensex) 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయిలో ఉండగా, నిఫ్టీ(nifty) 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (జులై 25న) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ 2024 (budget 2024) తర్వాత నిఫ్టీ నెలవారీ గడువు నేడు ముగుస్తుంది. దీంతో ఈరోజు ట్రేడింగ్ భారీ పతనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.35 గంటల నాటికి సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి 79,600 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 154 పాయింట్ల నష్టపోయి 24,263 పరిధిలో ఉంది.
బడ్జెట్ 2024కు ముందు రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) సోమవారం (జులై 22న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో మొదలైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) నేడు (జులై 19న) వారంతంలో భారీ నష్టాలతో మొదలయ్యాయి. నిన్న రికార్డ్ జంప్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఈరోజు అమ్మకాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(జులై 18న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ వీక్లీ గడువు తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బలహీనతతో మొదలైంది. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 200 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ(nifty) 60 పాయింట్లకు పైగా బలహీనపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఉదయం స్వల్ప లాభాలతో మొదలై, తర్వాత క్రమంగా సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11.15 గంటల నాటికి బీఎస్ఈ సెన్సెక్స్(sensex) 1.24 శాతం జంప్ చేసి 80,893.51 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ(nifty) 50 కూడా 1.13 శాతం పెరిగి 24,592.20 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) బుధవారం (జులై 10న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇండెక్స్లోని అన్ని సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.15 గంటల నాటికి సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టపోయి 79989 పరిధిలో ఉండగా, నిఫ్టీ 102 పాయింట్లు తగ్గి 24330 స్థాయి వద్ద ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) శుక్రవారం (జులై 5న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) సూచీలతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒత్తిడిలో కనిపించింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 10.40 నిమిషాల నాటికి 319 పాయింట్లు పడిపోయి 79,731 పరిధిలో ఉంది.