Home » New Delhi
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.
మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. పీఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకుంటున్నట్టు కూడా గుర్తించామని పేర్కొంది.
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.
3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నకిలీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హై ప్రొఫైల్ కేసులో పోలీసులు నిందితుడి కోసం మూడేళ్లుగా వెతుకుతున్నారు. ఎట్టకేలకు హనీమూన్ మూడ్లో ఉన్న ఆలంను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
మోదీ అధ్యక్షతన ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల కీలక సమావేశం ఆదివారంనాడు న్యూఢిల్లీలో జరుగనుంది. ఈ అత్యున్నత స్థాయి సమావేశం అశోకా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగనుంది.
మీ రాష్ట్రంలో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. శ్రామిక శక్తిలో మహిళల్ని మరింతగా భాగస్వాములు కావించాలన్నారు. జనం జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేద్దామన్నారు.
విమానాలు 10 వేల అడుగుల పైకి వెళ్లేంత వరకూ, ల్యాండింగ్ సమయంలో అంతే ఎత్తుకు దిగిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుందని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీల మాత్రం ఈ నిబంధన వర్తించదని డీజీసీఏ ఆ ఆదేశాల్లో పేర్కొంది.
ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండటం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటగా చెప్పాలి.
పాక్తో గూఢచర్యానికి పాల్పడిన కారణంగా ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై విచారణ సందర్భంలో పాక్ హైకమిషన్ సిబ్బంది పేరు వెలుగుచూసిందని తెలుస్తోంది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో టర్కీ దేశం బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే బ్యూరో ఆఫ్ సెక్యూరిటీ అండ్ సివిల్ ఏవియేషన్ భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్కూరిటీ నిర్వహణ అనుమతిని రద్దు చేసింది.