Home » New Delhi
మావోయిస్టుల కాల్పుల విరమణ ఆఫర్ను స్వాగతిస్తున్న వారిపై అమిత్షా మండిపడ్డారు. వామపక్ష తీవ్రవాదంపై చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'ను ఆపేయాలని ఇటీవల వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ, సీపీఐ-ఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు.
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఢిల్లీ బాబా వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలు నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలియగానే ఆయన రూ.50 లక్షలు విత్డ్రా చేసినట్టు గుర్తించారు.
ఢిల్లీకి చెందిన ఓ బాబాపై లైంగిక ఆరోపణల కేసు విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బేబీ, లవ్ యూ అంటూ బాబా అసభ్యకర వాట్సాప్ మెసేజీలను పెట్టిన మాట వాస్తవమేనని అధికారులు పేర్కొన్నారు.
జనాభాలో ఉద్యోగ ఉపాధి పొందే వయసున్న వారి వాటా అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అక్కడ 15 -59 ఏళ్ల వయసున్న వారి వాటా 70.8 శాతం. ఆ తరువాతి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి.
ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఏబీవీపీ కీలకమైన మూడు పోస్టులు సొంత చేసుకుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఎన్ఎస్యూఐకి ఒక్క వైస్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే తక్కింది.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎం. వెంకయ్యనాయుడు పక్కనే ధన్ఖడ్ కూర్చుని ఆయనతో సంభాషించడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ఆయన నవ్వుతూ గ్రీట్ చేశారు.
వివిధ కారణాల రీత్యా ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్కు చెందిన ఏడుగురు రాజ్యసభ్యులు, కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.