Home » NEET PG Exam
వైద్య విద్యా కోర్సులు చదవాలని ఆకాంక్షించే గ్రామీణ విద్యార్థులకు తీరని నష్టం కలిగించే నీట్ రద్దు చేయాల్సిందేనని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్(Movie actor Vijay) డిమాండ్ చేశారు.
నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీనిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్ యూజీ అంశంపై 3వ తేదీ (బుధవారం) ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరారు. ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్చ పెట్టాలి. ఆ చర్చలో పాల్గొనడం సభ్యుల కర్తవ్యం. చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని’ లేఖలో రాహుల్ గాంధీ కోరారు.
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
నీట్-యూజీని పెన్ను-పేపరు విధానానికి బదులు ఇక ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది.
నీట్-పీజీ పరీక్షల(NEET - PG Exams) కొత్త షెడ్యూల్ను మరో రెండు రోజుల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) శనివారం వెల్లడించారు.
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పెను దుమారం రేపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లీకేజ్ కారకులను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో నిందితుల నుంచి పేపర్ లీకేజీ ఎలా జరిగిందో రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కమార్ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ లీక్ అయిందని విమర్శించారు.
దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.. సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించింది.