Home » NEET PG Exam
గుజరాత్లోని రాజ్కోట్..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!
నీట్ పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది.
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.
నీట్ యూజీ కౌన్సెలింగ్పై గందరగోళం నెలకొంది. నీట్ యూజీ జాతీయ కోటా కౌన్సెలింగ్ నిరవధికంగా వాయిదా పడిందని శనివారం వార్తలు వెలువడ్డాయి.
నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
వాయిదా పడ్డ నీట్-పీజీ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్టు ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎ్స)’ శుక్రవారం ప్రకటించింది.
నీట్- 2024 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థుల అవగాహన కోసం నీట్-2023 సీట్ అలాట్మెంట్ బుక్లెట్ను సిద్ధం చేసినట్లు కోటా పేజెస్ సంస్థ తెలిపింది.
నీట్ యూజీ 2024 పరీక్షను(NEET UG 2024) పూర్తిగా రద్దు చేయడం వల్ల పరీక్ష రాసిన లక్షలాది మంది నిజాయతీపరులకు అన్యాయం జరుగుతుందని.. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై(NEET Paper Leakage) సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పింది.
పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలను ప్రకటించారు. శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ కొత్త తేదీలను ప్రకటించింది.