Home » NDA Alliance
జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. హామీల విషయంలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తాము పెద్దగా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని అన్నారు. కూటమి పెద్దలు ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత .2026లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పారని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు.
విశాఖపట్నంలో మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. బీచ్ రోడ్డులో ఉన్న టూరిజం యాత్రి నివాస్ని సందర్శించారు. జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా లకు చెందిన జడ్పీటీసీలు, నాయకులతో మాజీ సిఎం జగన్ సమావేశం అయ్యారు.
మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కార్కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు.
అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వివరించారు. ధాన్యం బకాయిలు వైసీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కూటమి ప్రభుత్వం రూ. 1600 కోట్ల రైతు బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. ఆధునిక టెక్నాలజీ డ్రోన్ ద్వారా పంటలకు పురుగు మందులు పిచికారీ చేసే విధానంతో మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా చెల్లిస్తున్నాయని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు.
ఏపీలో వరదలను ఎదుర్కొన్నతీరు సీఎం చంద్రబాబు పాలనదక్షతకు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు. కూటమి ప్రభుత్వం 100 రోజులపాలన సందర్భంగా సీఎం చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపించారు.
సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే లాభమా? నష్టమా? తెలుసుకుందాం..