Home » NDA Alliance
ఎన్డీయే కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి ప్రజలు తనపట్ల చూపించిన ప్రేమాభిమానాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (ap elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 4వ వార్డు శాంతినగర్లో ఉన్న పోలింగ్ కేంద్రం 164, 169, 170, 171 బూత్ల వద్ద రిగ్గింగులకు వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న వేళ.. వైసీపీ (YSRCP) తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల (Polling Booths) వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా పోలింగ్ బూతుల్లో అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తోంది. ఓటర్లను వైసీపీ మూకలు భయ భ్రాంతులకు గురి చేసి దాడులకు తెగబడ్డారు.
దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం మోదీ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.
ఏపీలో పోలీసులు ఇంకా వైసీపీ (YSRCP) కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని చీవాట్లు పెట్టినా వారు తీరు మాత్రం మారడం లేదు. పోలింగ్ కు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. అయినా కూడా వైసీపీకి వత్తాసు పలకడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆరోపణలు వస్తున్న పోలీసు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇచ్చి కూటమి అభ్యర్థులకు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజా ప్రసంగించారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు.
ఐదేళ్ల జగన్ (CM Jagan) పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ (MA Sharif) తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగిందని అన్నారు. ఓడిపోయే వైసీపీకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.