Home » NDA Alliance
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసినా.. ప్రస్తుతం మరోసారి ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Assembly Bypolls) ఫలితాలు మధ్యాహ్నంకల్లా విడుదల కానున్నాయి.
కేంద్రంలోని మోదీ(PM Modi) సర్కార్ జులై 23న 2024 - 25 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్(Union Budget 2024 - 25) ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులపై సమీక్షించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.
కేంద్ర సాయుధ దళాల్లోని 10 కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్క్వార్టర్స్లో ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తెలిపారు.
బడ్జెట్ 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న ఏడో బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన కీలక బడ్జెట్ల గురించి తెలుసుకుందాం.
సొంత ప్రతాపం కొంత ఉంటే, జబ్బలు ఎంత చరుచుకున్నా ఒక అందం. అరువు బలం మీద ఆధారపడి, అంతా తమ ప్రతాపం అంటేనే వికారం. మొదటికే మోసం వచ్చినా, మూడోసారి మహాప్రసాదమని మురిసిపోతున్న ప్రధాని మోదీ...
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పేద ప్రజలకు ఇసుక లేకుండా చేశారని ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైందని జనసేన నాయకులు బండి రామకృష్ణ (Bandi Ramakrishna) విమర్శించారు. ఉచిత ఇసుక అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకొంది.
లోక్సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
తనను టార్గెట్ చేసి సభ నుంచి బహిష్కరించినందుకే లోక్ సభలో బీజేపీకి 63 మంది సభ్యుల బలం తగ్గిందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)దుయ్యబట్టారు.
కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అయితే ఈ చట్టాలు అమలు చేసే ముందు ఉభయ సభల్లో సరైన చర్చ జరగలేదని విపక్షాల నుంచి ప్రధానంగా ఎదురవుతున్న ఆరోపణ. ఈ ఆరోపణల్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఖండించారు.