Home » NCP
సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర ప్రదేశ్ యువజన విభాగమైన సమాజ్వాది యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫహద్ అమ్మద్ ఉన్నారు. అయితే ఎన్సీపీ-ఎస్సీపీ అభ్యర్థిగా ఫహద్ అహ్మద్ను నిలబెట్టాలని తాము అనుకుంటున్నట్టు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను శరద్ పవార్ కోరడంతో ఎన్సీపీ(ఎస్సీపీ)లో ఫహద్ అహ్మద్ చేరారు.
2019 ఎన్నికల్లో బాంద్రా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీషన్ సిద్ధిఖీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఆగస్టులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీషన్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని పార్టీ నుంచి అతన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.
38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది. బారామతి నుండి అజిత్ పవార్, యోలా నుండి ఛగన్ భుజబల్ను ఎన్నికల బరిలో నిలిపింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించడం, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు జీషన్ సిద్ధిఖీ కూడా హంతకుల టార్గెట్లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం "ఎక్స్''లో జీషన్ సిద్ధిఖీ తొలిసారి స్పందించారు.
శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శరద్) పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే మూడు పార్టీలు చర్చలు ప్రారంభించాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలతో ఓ కమిటీని ఏర్పాటుచేసి, సీట్ల పంపకంపై చర్చించారు. 200కు పైగా సీట్లలో ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (శరద్) పార్టీ ప్రకటించినప్పటికీ తాజాగా శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రానట్లు
ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కొద్ది గంటలకే ఆయనను తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ప్రకటించింది. దీంతో బాబా సిద్ధిఖి హత్యకు బాలీవుడ్తో ఆయనకు సత్సంబంధాలు ఉండటం ఒక కారణం కావచ్చా అనే కొత్త కోణం కూడా వెలుగుచూసింది.
ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధిఖీని తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ముంబై: ఎన్సీపీ (NCP) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య పక్కా ప్లానింగ్తోనే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంట్రాక్ట్ హత్య కావచ్చునా, వ్యాపారంలో శత్రుత్వమే కారణమా, స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కారణంగానే ఆయనను హంతకులు మట్టుబెట్టారా అనే పలు కోణాల నుంచి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ముంబైలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ నిన్న రాత్రి హత్యకు గురయ్యారు. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.