Home » NCP
ఎన్నికల ప్రచారం కోసం బుధవారంనాడు బారామతి వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగులను తనిఖీ చేసినట్టు అజిత్ పవార్ ఒక ట్వీట్లో తెలిపారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.
సిద్ధిఖి హత్య వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చిన్న సోదరుడైన అన్మోల్ ఉన్నట్టు అనుమానిస్తుండగా, అన్మోల్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. ముంబైలోని బాంద్రా ఏరియాలో సిద్దిఖిని అక్టోబర్ 21న ముగ్గురు సాయుధులు కాల్చిచంపారు.
పెళ్లికాని ప్రసాదులకు విచిత్ర హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అజిత్ పవార్ వర్గానికి గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ-ఎస్పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించింది. దీనిపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అజిత్ వర్గం పాటించలేదని శరద్ పవార్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో తన వాదనను వినిపించారు.
ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.
పద్నాలుగు సార్లు తాను ఎన్నికల్లో పోటీ చేసానని, ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత పార్లమెంటరీ స్థానాన్ని విడిచిపెట్టాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తానని చెప్పారు. ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల్లో గెలవాల్సిన పని లేదని, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..
బహిరంగంగా తనకు మద్దతు తెలిపిన పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్కు నవాబ్ మాలిక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. జైలు భయంతో తాను అజిత్ పవార్తో కలవలేదని, జైలుకు వెళ్లేందుకు తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు.
బారామతి నుంచే పోటీ చేస్తున్న అజిత్ పవార్ సోమవారంనాడు నామినేషన్ అనంతరం కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ శరద్ పవార్ను తప్పుపట్టారు. దీనిపై శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో ఘాటుగా స్పందించారు. కుటుంబం విచ్ఛిన్నం చేయడాన్ని తన తల్లిదండ్రులు, సోదరులు ఎన్నడూ నేర్చించ లేదన్నారు.
మహాయుతి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. మహాయుతి ప్రభుత్వం అమలు చేస్తున్న పథాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలేనని, ఏ పథకాన్ని ఆపేసే ప్రసక్తి లేదని అన్నారు.