Home » NCP
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు.
అజిత్ పవార్ తిరుగుబాటు వర్గం తన ఫోటో వాడుకోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడుకోరాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం మరింత ముదురుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ పునర్మిర్మాణానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పట్టుదలతో ఉండగా, పార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నందున తనదే అసలైన ఎన్సీపీ పార్టీ అంటూ అజిత్ పవార్ అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు నేతలూ ఎన్సీపీ సమావేశానికి పులుపునిచ్చారు.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన అజిత్ పవార్ మంగళవారం నూతన కార్యాలయంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ బంగళా తాళాలు కనిపించకపోవడంతో నేతలంతా బంగళా వెలుపల కూర్చోవలసి వచ్చింది. తాళాల కోసం అనేక మందికి ఫోన్లు చేశారు. ఎట్టకేలకు ప్రవేశ మార్గంలోని తలుపు తాళాన్ని తొలగించగలిగినప్పటికీ, బంగళా లోపలి గదుల తాళాలు దొరకలేదు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శి హెచ్కే పాటిల్ ఈ సమావేశానికి హాజరవుతారు. శాసన సభలో ప్రతిపక్ష నేత పదవిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఈ పదవికి శుక్రవారం రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ క్రమశిక్షణా చర్యలకు దిగారు. ముగ్గురు నేతలను పార్టీ నుంచి తొలగించారు.
అజిత్ పవార్(Ajit Pawar) తిరుగుబాటుపై ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను బీజేపీ(BJP) నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఆదివారంనాడు చేరడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ఎన్సీపీ చీఫ్, మరాఠా దిగ్గజ నేత శరద్ పవార్ మండిపడ్డారు. ఇదేమీ గుగ్లీ కాదని, రాబరీ అని అన్నారు. అయితే, ఇలాంటివేమీ తనకు కొత్త కాదని చెప్పారు.