• Home » NCP

NCP

Sharad Pawar: మేం ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకుంటే మార్పు తీసుకురాగలం

Sharad Pawar: మేం ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకుంటే మార్పు తీసుకురాగలం

తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.

Opposition Meet Updates: విపక్షాల సమావేశంలో రెండో రోజు పాల్గొననున్న శరద్‌ పవార్

Opposition Meet Updates: విపక్షాల సమావేశంలో రెండో రోజు పాల్గొననున్న శరద్‌ పవార్

బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Monsoon Session eve: ప్రభుత్వ టీపార్టీని బహిష్కరించిన విపక్షాలు

Monsoon Session eve: ప్రభుత్వ టీపార్టీని బహిష్కరించిన విపక్షాలు

మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ నేతలు బహిష్కరించారు. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

NCP : శరద్ పవార్‌తో అజిత్ పవార్ వర్గం భేటీ

NCP : శరద్ పవార్‌తో అజిత్ పవార్ వర్గం భేటీ

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం వినూత్న వ్యాఖ్యలు

Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం వినూత్న వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించినపుడు, మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెడుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.

Maha Cabintet Portfolios: ఢిల్లీ పెద్దలతో అజిత్ పవార్ అమీతుమీ..!

Maha Cabintet Portfolios: ఢిల్లీ పెద్దలతో అజిత్ పవార్ అమీతుమీ..!

మహారాష్ట్ర రాజకీయ వేడి హస్తినకు తాకింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి మహారాష్ట్రలోని అధికార శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఇటీవల చేరిన అజిత్ పవార్ బుధవారం రాత్రి హస్తినకు చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి అజిత్ తీసుకువెళ్లనున్నారు.

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.

Sharad Pawar: కొందరిని గుడ్డిగా నమ్మి తప్పుచేశా.. క్షమించండి..!

Sharad Pawar: కొందరిని గుడ్డిగా నమ్మి తప్పుచేశా.. క్షమించండి..!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభానికి తాను ఎవరినీ తప్పుపట్టనని, ఇందుకు బాధ్యత తానే తీసుకుంటానని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఎన్‌సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం ప్రజల ముందు వాస్తవాలు వివరించేందుకు శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శనివారంనాడు శ్రీకారం చుచ్టారు. వర్షంలో తడుస్తూనే నాసిక్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి