Home » NCP
‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు.
తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.
బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ నేతలు బహిష్కరించారు. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన-ఎన్సీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించినపుడు, మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెడుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర రాజకీయ వేడి హస్తినకు తాకింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి మహారాష్ట్రలోని అధికార శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఇటీవల చేరిన అజిత్ పవార్ బుధవారం రాత్రి హస్తినకు చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి అజిత్ తీసుకువెళ్లనున్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.