Home » Naveen Patnaik
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావించారు. అకస్మత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక కారణం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను బీజేడీ నేత వీకే పాండియన్ 'కంట్రోల్' చేస్తు్న్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసిన వీడియో సంచలనమవుతోంది. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘాటుగా స్పందించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాకిస్థాన్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన విమర్శలు చేశారు.
ఎన్నికల్లో ఒడిశా ముఖ్యమంత్రితో తనకున్న సత్సంబంధాలను ప్రధాని పక్కకు పెట్టేశారు. దీనికి కారణంపై మోదీ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఆపని చేసినట్టు చెప్పారు.
భారతీయ జనతా పార్టీపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తన ఆరోగ్యంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది.
ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోదీ చేసిన సవాల్పై బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అసలు మీకు ఒడిశా గుర్తుందా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు కాంధమాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్ కు సవాల్ విసిరారు. ఒడిశాను సుదీర్ఘ కాలంగా పాలించిన పట్నాయక్ పేపరు చూడకుండా అన్ని జిల్లాల పేర్లు చెప్పాలని ఛాలెంజ్ చేశారు.