Home » Naveen Patnaik
ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.71 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు.
ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడి అధికార బిజూ జనతాదళ్ పార్టీ బీజేపీతో కటీఫ్ చెప్పి 15 సంవత్సరాలు గడుస్తోంది.
లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే యోచనలో ఉన్నాయి. పొత్తు ఖరారైన పార్టీలు ప్రచారంలో వేగం పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోగా.. ప్రాధాన్యతా క్రమంలో సీట్ల పంపకం జరిగింది.
నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే.. మగవారితో పోలిస్తే ఉద్యోగాలు చేసే ఆడవారు కాస్త ఎక్కువగా శ్రమిస్తుంటారు.
లోక్సభ ఎన్నికలకు ముందు BJP నేతృత్వంలోని NDA తన సీట్లను పెంచుకునే పనిలో భాగంగా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఒడిశాలో అధికార బీజేడీ బీజేపీతో తిరిగి పొత్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
లోక్సభ ఎన్నికల వేళ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో బిజూ జనతాదళ్తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒడిశాలో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.