Home » Narendra Modi
శ్రీలంక నుంచి తిరిగివస్తుండగా రామసేతు దర్శన భాగ్యం లభించిందని, ఇదే సమయంలో దైవిక యాదృచ్ఛికంగా అయోధ్యలో సూర్య కిరణాలు బాలరాముని నుదట తిలకం దిద్దాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
అభివృద్ధి భారతం (వికసిత్ భారత్)లో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని, పంబన్ రైల్వే వంతెనపై కొత్త రైలు సర్వీసుతో రామేశ్వరం, చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
పాంబన్ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉచిత రేషన్ అందుకుంటున్న వారి తలసరి ఆదాయం ఎంతో ఉందో తెలుసుకుంటే అది అర్థమవుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఇరుదేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రి, చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.
Babu Jagjivan Ram: భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని నేతలు కొనియాడారు.
ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు శ్రీలంక చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతూ, శ్రీలంక అధ్యక్షుడితో కీలక ఒప్పందాలు కుదుర్చే అవకాశం ఉం
బ్యాంకాక్ సదస్సులో బిమ్ స్టెక్ ను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ 21 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. వివిధ దేశాలతో చెల్లింపు వ్యవస్థలు అనుసంధానం చేస్తే పర్యాటక వాణిజ్య రంగాలలో ప్రయోజనాలు అందుతాయని తెలిపారు
సుస్థిర, ప్రగతిశీల, ప్రశాంత, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్కు తమ మద్దతు ఉంటుందని, ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని యూనస్తో జరిగిన భేటీలో మోదీ పునరుద్ఘాటించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలిపారు.
ప్రధాని మోదీ థాయ్లాండ్ పర్యటనలో వికాసవాదాన్ని నమ్ముతామని, విస్తరణవాదాన్ని తాము ఆశించమని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, చట్టబద్ధ వ్యవస్థ కోసం భారత్ కట్టుబడి ఉందని తెలిపారు