Home » Nara Chandra Babu Naidu
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్ టెండరింగ్ అమలుతో అంతులేని నష్టం జరిగింది.
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..
ఒక కార్యకర్త మంత్రి అయ్యారు.. అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి సుభాష్ సంఘటనే ఒక ఉదాహరణ. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subash) మూడు నెలల కిందట మండపేటలో తెలుగుదేశం (Telugu Desam) పార్టీలో చేరారు...
పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్లో అధిక స్థానాలు కేటాయించారు.
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల చేరుకొని అతిథి గృహం వద్ద బస చేశారు. సీఎం చంద్రబాబు బస చేసే అతిథి గృహం పక్కన పరదాలు కట్టారు. ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని తాను చేసిన శపధాన్ని ప్రజలు గౌరవించారని.. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.