Home » Nara Chandra Babu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..
శిద్దా రాఘవరావు.. వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు సరే.. టీడీపీలోకి (TDP) ఎంట్రీ లేదని కూడా క్లియర్ కట్గా సందేశం వచ్చేసింది..! ఇప్పుడీ సీనియర్ నేత భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్న శిద్దా (Sidda Raghava Rao) పరిస్థితి ఇప్పుడేంటి..?
శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi).. సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు..
ఆంధ్రప్రదేశ్లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ‘దేవుడా ఇదెక్కడి ప్రజాస్వామ్యం’ అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా...
పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.
సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ
సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్ టెండరింగ్ అమలుతో అంతులేని నష్టం జరిగింది.
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..