• Home » Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

Chennai: టీడీపీ విజయంపై ట్రిప్లికేన్‌లో సంబరాలు..

Chennai: టీడీపీ విజయంపై ట్రిప్లికేన్‌లో సంబరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆహ్వానిస్తూ స్థానిక ట్రిప్లికేన్‌లో నివసిస్తున్న తెలుగు వారు సంబరాలు జరుపుకున్నారు.

చంద్రబాబు, పవన్‌కి ఆశీర్బలంగా పురాణపండ అందిస్తున్న మంత్ర పేటికలు

చంద్రబాబు, పవన్‌కి ఆశీర్బలంగా పురాణపండ అందిస్తున్న మంత్ర పేటికలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి సమర్ధవంతమైన పాలన అందిస్తారని, అందివ్వాలని కోరుతూ.. ఇటీవల కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.. అనే రెండు రమణీయ గ్రంధాలను బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ సన్నిధానంలో మహాత్ములైన చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతనధర్మతేజస్సుతో ఆవిష్కరించడం ఎంతో వైభవంతో వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది. ఈ రెండు ఆర్ష భారతీయ దివ్య గ్రంధాలకూ పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్త కావడం.. ఈ గ్రంధాలు ఎంతో సౌందర్యంతో రూపు దిద్దుకోవడం ప్రత్యేకంగా పేర్కొనాలి. ఇప్పుడీ అపురూప దైవీయ చైతన్యపు గ్రంధాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలను ప్రచురించాలని టీడీపీ శ్రేణులు కోరినట్లు సమాచారం.

Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్..?

Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్..?

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..

CBN And Pawan: సచివాలయంలో తొలిసారి సీబీఎన్-పవన్ భేటీ.. సరదా సంభాషణ!

CBN And Pawan: సచివాలయంలో తొలిసారి సీబీఎన్-పవన్ భేటీ.. సరదా సంభాషణ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..

Sidda Raghava Rao: నో చెప్పిన చంద్రబాబు.. శిద్దా భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

Sidda Raghava Rao: నో చెప్పిన చంద్రబాబు.. శిద్దా భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

శిద్దా రాఘవరావు.. వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు సరే.. టీడీపీలోకి (TDP) ఎంట్రీ లేదని కూడా క్లియర్ కట్‌గా సందేశం వచ్చేసింది..! ఇప్పుడీ సీనియర్ నేత భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్న శిద్దా (Sidda Raghava Rao) పరిస్థితి ఇప్పుడేంటి..?

SriLakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం.. ఈసారి ఏకంగా..?

SriLakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం.. ఈసారి ఏకంగా..?

శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi).. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు..

RK Kothapaluku: గతం మరిచి గగ్గోలు...

RK Kothapaluku: గతం మరిచి గగ్గోలు...

ఆంధ్రప్రదేశ్‌లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ‘దేవుడా ఇదెక్కడి ప్రజాస్వామ్యం’ అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా...

Vangalapudi Anitha: అనితకు హోం మంత్రి పదవి దక్కడం వెనుక..?

Vangalapudi Anitha: అనితకు హోం మంత్రి పదవి దక్కడం వెనుక..?

పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.

Chandrababu Cabinet: డిప్యూటీ సీఎం పవన్‌.. ఎవరికి ఏ శాఖలు..?

Chandrababu Cabinet: డిప్యూటీ సీఎం పవన్‌.. ఎవరికి ఏ శాఖలు..?

సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ

చంద్రబాబు క్షేమం కోసం ‘జయ జయ శత్రు భయంకర’: శ్రీనివాస్‌తో స్వరం కలిపిన కృష్ణయ్య

చంద్రబాబు క్షేమం కోసం ‘జయ జయ శత్రు భయంకర’: శ్రీనివాస్‌తో స్వరం కలిపిన కృష్ణయ్య

సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి