Home » Nara Chandra Babu Naidu
పోలింగ్కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఓటు వేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు.
బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.
మాచర్లలో వైసీపీ పాలనలో ఐదేళ్లు అప్రజాస్వామిక పరిస్థితులతో ప్రజలు భయాందోళనలు చెందారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈరోజు మాచర్ల ప్రజాగళం సభకు రాలేకపోయానని తెలిపారు. ఈమేరకు మాచర్ల సభను ఉద్దేశించి చంద్ర బాబు వీడియో సందేశం విడుదల చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.
తెలుగుదేశం కంచుకోట గన్నవరంలో వైసీపీ సైకోల ఆటలు ఇక సాగవని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ (వైసీపీ) తిరిగితే ప్రజల మెడకు ఉరేనని అన్నారు. రేపు సాయంత్రం 4గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా రోడ్ల పైకి వచ్చి జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాల నకళ్లను తగలబెట్టాలని పిలుపునిచ్చారు.
ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే గన్నవరంలో కూడా భారీ వర్షం పడుతుండటం.. ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం సభ కూడా జరుగుతోంది.
రాష్ట్రాన్ని అపహస్యం చేసి.. గంజాయి మయంగా చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవుతుందని ఉద్ఘాటించారు.
ఉత్తరాంధ్రాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. . ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడనే స్ధాయా బొత్సది? కాదని హితవు పలికారు.