Home » Nara Bhuvaneswari
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలు విద్యార్థులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పిల్లలతో భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ పిల్లలతో ఆమె ఆనందంగా గడిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత సభకు విచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను అవమానించడంతో శపథం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రోజు చంద్రబాబు నాయుడు సభకు రావడంతో ఆయన సతీమణీ భువనేశ్వరి సంతోష పడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి(Undavalli) నివాసానికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఇవాళ(గురువారం) ఉదయం నుంచీ పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.
Nara Bhuvaneshwari Birthday: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు నేడు. ఆమె జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ విషెష్ చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు.
తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తెలిపారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు చకచకా పనులు చక్కదిద్దుతూ ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ నారా భువనేశ్వరి సైతం ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును తన ప్రాణం గానూ.. తనలో సగంగానూ భువనేశ్వరి పేర్కొన్నారు.
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు.
ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది.
ఆంధ్రప్రదేశ్కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.