Home » Nampalli
నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిగింది. అందులోభాగంగా కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమె ఇలాంటి వాఖ్యలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సమాజంలో తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. అయితే వాటిని దిగజార్చాలానే ఆమె ఈ తరహా వాఖ్యలు చేసిందని కోర్టుకు కేటీఆర్ విన్నవించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. గత విచారణ సందర్భంగా కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
తెలుగు యూనివర్సిటీ వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని వర్సిటీలో ఆయన 12వ వీసీగా బాధ్యతలు చేపట్టారు.
రాజధాని నడిబొడ్డున నాంపల్లి రెడ్హిల్స్లో ఉన్న సబ్రిజిస్టార్ కార్యాలయానికి ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదనే కారణంతో కరెంట్ కట్ చేయడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టుకు హాజరుకావలసి ఉంది. అయితే ఈ కేసు సోమవారంకు వాయిదా పడింది. దీంతో ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే.
రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 1 0 గంలకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, హర్యానా గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. సినీ ప్రముఖులను కూడా అలయ్ బలయ్ కమిటీ అహ్వానించింది.
నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు.
మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో ఆమెకు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.