Home » Nalgonda
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టు పనులు కుదుపునకు గురయ్యాయి. శనివారం ఇన్లెట్ (శ్రీశైలం) నుంచి సీపేజీ పనులు జరుగుతుండగా... ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలటం, 8 మంది చిక్కుకుపోవటం కలకలం రేపింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధి పైనంపల్లి వద్ద పాలేరు ఏరులో కోళ్ల కళేబరాలు కలకలం రేపాయి. శుక్రవారం ఏటి వైపు ఉన్న తమ పొలాలకు వెళ్లిన రైతులకు ఏరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న కోళ్లు కనిపించడంతో బెంబేలెత్తిపోయారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.
ఓ లింగా.. ఓ లింగా అంటూ నామస్మరణలు, భేరీ చప్పుళ్లు, కఠారీ విన్యాసాల నడుమ సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్పల్లి శ్రీ లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల బాలికల హాస్టల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది యువకులు హాస్టల్ గోడ దూకడం తీవ్ర కలకలం రేపింది.
Online Fraud: యాదాద్రి జిల్లా రాజాపేట్ తహసీల్దారుగా దామోదర్ను ఓ కేటుగాడు మోసం చేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేటుగాడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
‘పై సంపాదన’ జేబులో పడితే కిక్కే వేరు కావొచ్చు గానీ పట్టుబడితే ఎన్ని చిక్కులో కదా! ఈ లాజిక్ మరిచి.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు వేర్వేరుచోట్ల నలుగురు అధికారులు!
హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్లో.. ఓ కోళ్ల ఫాం నిర్వాహకుడు పెద్దసంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశాడు.
నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై శుక్రవారం రాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయి.