Home » Nalgonda
రూ.1000 కోట్లతో ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వల డిస్ట్రిబ్యూటరీ లైనింగ్, మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ ఘటన నల్లగొండలోని ఉస్మాన్పురాలో గత నెల 24న జరిగింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు వివరాలను మంగళవారం వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సోమవారం నల్లగొండ కోర్టు వెలువరించిన తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో.. నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది.
సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన తన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీనృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. గురువారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీ. ఆ కళాశాలలో విద్యార్థులు కేవలం అడ్మిషన్ల సమయంలోనే కనిపిస్తారు. మళ్లీ పరీక్షల నాటికి వచ్చి కాలేజీలో వాలిపోతారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.
నల్గొండ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నల్లగొండ - ఖమ్మం - వరంగల్ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థుల్లో పోటాపోటీ నెలకొంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ప్రచారం తారస్థాయికి చేరింది.
యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.