• Home » Nalgonda News

Nalgonda News

నూతనకల్‌ పీఏసీఎస్‌ చైర్మనపై అవిశ్వాసం

నూతనకల్‌ పీఏసీఎస్‌ చైర్మనపై అవిశ్వాసం

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ పీఏసీఎస్‌ చైర్మనపై అవిశ్వాసానికి డైరెక్టర్లు సిద్ధమయ్యారు.

 మనస్తాపంతో ఇద్దరి బలవన్మరణం

మనస్తాపంతో ఇద్దరి బలవన్మరణం

కడుపునొప్పి తట్టుకోలేక యువతి ఉరివేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.

 దాడులకు పాల్పడితే సహించేది లేదు : ఎంపీ

దాడులకు పాల్పడితే సహించేది లేదు : ఎంపీ

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

MinisterVenkat Reddy: పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు

MinisterVenkat Reddy: పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు

పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు నల్గొండలో ప్రజా పాలన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

TS NEWS: నల్గొండ జిల్లాలో దారుణం.. కలకలం రేపుతున్న యువకుడి హత్య

TS NEWS: నల్గొండ జిల్లాలో దారుణం.. కలకలం రేపుతున్న యువకుడి హత్య

జిల్లా కేంద్రంలో దారుణం ఘటన జరిగింది. తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సాయి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాగా ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. తల, మొండెం వేరు చేసి నల్గొండలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. రైల్వే పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు తరలించారు.

Minister Komati Reddy: నీటి కల్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

Minister Komati Reddy: నీటి కల్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలి

అధికారులంతా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తెలిపారు.

అలంకారప్రాయంగా మఠంపల్లి సబ్‌మార్కెట్‌

అలంకారప్రాయంగా మఠంపల్లి సబ్‌మార్కెట్‌

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో చివరలో ఉండే మఠంపల్లి మండలంలో వ్యవసాయ సబ్‌మార్కెట్‌ అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది.

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు.

Congress: నల్లగొండలో కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్.. పరామర్శించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Congress: నల్లగొండలో కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్.. పరామర్శించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS)ల మధ్య రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. తాజాగా నగరంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 40 మందికి గాయాలు..

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 40 మందికి గాయాలు..

హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద విజయవాడ వైపు వెళ్తున్న కోదాడ ఆర్టీసీ డిపో బస్సు... మొక్కలకు నీళ్లు కొట్టే వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి