Home » Nadendla Manohar
గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల మహోహర్ తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడేందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్పై నియమించిన సిట్లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
‘కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత మూడేళ్లలో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల (13.10 లక్షల క్వింటాళ్లు) రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించాం. దీనిపై సిట్ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.
కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళుతున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతులకు అన్నివిధాలుగా అండగా నిలవాలని అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు వైసీపీ నేతలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ చేయడం....
కాకినాడ పోర్టు ద్వారా భారీస్థాయిలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారో? కాకినాడ పోర్టును లాక్కోవడానికి చేసిన దౌర్జన్యాల వెనుక ఎవరున్నారో మాజీ సీఎం జగన్ నోరు విప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.
తేమ 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశిలిచ్చామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఏపీవ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం అమల్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతాయని హామీ ఇచ్చారు.