Home » Nadendla Manohar
Minister Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులపాలు చేసి రైతులకు బకాయిలు చెల్లించలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోనే రైతులకు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ. 600 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు..
కాకినాడ పోర్టు స్టెల్లా నౌక వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. స్వాధీనం చేసుకున్న 4,093 బస్తాలను ఎల్ఎమ్ఎస్ పాయింట్లకు తరలించినట్లు మంత్రి తెలిపారు.
ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు.
పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ సోమవారం సాయం త్రం.....
గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల మహోహర్ తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడేందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్పై నియమించిన సిట్లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.