Home » Mulugu
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ ఏడాది ఆగస్టు 31న సుమారు 15 కిలో మీటర్ల వ్యవధిలో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య.. అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది.
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఏటూరునాగారం అభయారణ్యాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతంగా(ఎకో సెన్సిటివ్ జోన్గా) మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: చెల్పాక ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పౌరహక్కుల సంఘం నేతలు పరిశీంచారు. చెల్పాక ఎన్కౌంటర్ అంతా బూటకమే అని, అన్నంలో విషం పెట్టి చంపారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు.
పౌరహక్కుల నేతల తీరుపై మావోయిస్టు బాధిత కుటుంబాలు భగ్గుమన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్పై నిజనిర్ధారణకు వస్తున్నారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్దపులులు, చిరుతలు దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు.
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులుగుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు.
ములుగు జిల్లా ములుగు మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకులం మైదానంలో సీఎం కప్ క్రీడాపోటీలను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు
ములుగు: జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు.
వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆత్మహత్య సమయంలో అతడి వద్దే ఉన్న యువతి.. తమ మధ్య ఉన్న సంబంధంపై ఆదివారం పలు విషయాలు వెల్లడించింది.
ములుగుజిల్లా చల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.