Home » Mulugu
తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు.
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు.
కొంతకాలంగా వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తుల్ని హతమార్చి ఒక్కసారిగా అలజడి సృష్టించారు.
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
పొలంలో విద్యుదాఘాతం, పాము కాటుకు గురై ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వెంకన్న, సుభద్ర దంపతుల మూడో కుమారుడు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీ్సగఢ్లోని నారాయణపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ములుగు జిల్లా: గొల్లాల గుడిలో గుప్తనిధుల తవ్వకాలు జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుడి పైకప్పు తొలగించడంతో శిఖరం దెబ్బతింది. పైకప్పులో వికసించే తామరపువ్వు గుర్తుతో ఉన్న శిల్పాన్ని దుండగులు పూర్తిగా ధ్వంసం చేసి ఆలయ పరిసరాల్లో పడేశారు. శివలింగం ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తోంది.
ఇంత పెద్ద విధ్వంసం చోటు చేసుకున్నా.. భారీ వృక్షాలు నేలకొరిగినా.. అక్కడి జంతువులకు, పక్షులకు హానీ జరిగినట్లు ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఇంత పెద్ద విపత్తులోనూ ఒక్క జంతువు గానీ, ఒక్క పక్షి గానీ గాయపడినట్లు, చనిపోయినట్లు వెలుగుచూడలేదని..
సామాజిక న్యాయం జరగాలంటే పేదరికంపై యుద్ధం జరగాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.