Home » Mulugu
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య(50) శనివారం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.
ములుగు జిల్లా: డీఎంహెచ్వో డా. అప్పయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసులకు వైద్యం అందించారు. కొండ కోణల్లో ఉండే గిరి పుత్రులు జ్వరాలతో బాధ పడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక.. వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
పసిప్రాయం నుంచే అక్షరాభ్యాసం చేయించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల భవిష్యత్కు పునాది వేస్తున్నామని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
కడుపు నొప్పి వచ్చినా.. పురుటి నొప్పులు మొదలైనా.. అక్కడివారి బాధలు అరణ్య రోదనే..! విష సర్పం కాటువేసినా.. విష జర్వం బారినపడినా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే..!
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద ఉన్న ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రశ్నించింది.
ఏటూరునాగారం(Eturnagaram) వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ములుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు.. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు.. శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు.. దానికి కౌంటర్గా పోలీసులే లక్ష్యంగా బూబీట్రాప్స్, మందుపాతరలతో నక్సల్స్ ప్రతివ్యూహాలతో ఛత్తీ్సగఢ్-తెలంగాణ సరిహద్దు ఏజెన్సీల పౌరులు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఏసు అనే స్థానికుడు బలవ్వడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు విలవిల్లాడుతున్నారు.
వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన (Landmine Explosion) ఘటనపై మావోయిస్టులు (Maoists) స్పందించారు. మందుపాతర పేలి ఏసు అనే వ్యక్తి మృతిచెందడం బాధాకరమన్నారు. తమ జాడకోసం పోలీసులే ఏసును అటవీప్రాంతంలోకి పంపి ప్రాణాలు తీశారని ఆరోపించారు.
తమ జాడ కనుగొనేందుకు ఇల్లెందుల ఏసు అనే వ్యక్తిని పోలీసులే అడవిలోకి పంపగా మందుపాతర తొక్కి అతడు మరణించాడని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఏసు మరణానికి పోలీసులే బాఽధ్యులని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంటూ