Home » Mulugu
సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాక్కు గురవుతుంటారు. అప్పటివరకూ అంతా మామాలుగా సాగిన వారి జీవితం.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు.
ములుగు జిల్లా భూకంపంపై ప్రముఖ ఎన్జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేశ్ స్పందించారు. జన సంచారం లేని ప్రాంతంలో భూకంపం రావడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త సంచలన విషయాలు వెల్లడించారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరునాగారం ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ (29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రైవేటు రిసార్టులో సోమవారం ఆయన సర్వీసు రివాల్వర్తో కాల్చుకున్నారు.
ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.
ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు.
ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు.