Home » Modi 3.0 Cabinet
హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.
దేశంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని ఇకపై సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించినట్లు మోదీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తనదైనశైలిలో స్పందించింది.
భారత ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి.. వచ్చే ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకొనుంది. అలాంటి వేళ.. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.
సింగరేణిని ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కమార్ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ లీక్ అయిందని విమర్శించారు.
మోదీ 3.0 ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్లో ఉద్యోగ వర్గాలు, వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. దాంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారాయి. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఫలితాలు పునరావృతం కాకుండా బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.