Home » MLC Kavitha
BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రం లో పోరాడుతూనే ఉందామని అన్నారు.
MLC Kavitha: కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారిందని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు. ఎంతో మంది మేధావుల, ఇంజనీర్ల కృషి ఫలితమే అనేక ప్రాజెక్టుల నిర్మాణమన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లామని.. కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విర్మిస్తోందని మండిపడ్డారు.
Kavitha:తెలంగాణలో రాజ్యాంగ విలువలు కాపాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు. రౌడీ మూకలతో దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్ది కాదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మా జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు.
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పోయాక కేటీఆర్ రైతు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్కు అవమానం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల్పూర్ వద్ద స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసామని, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. జక్రాన్ పల్లి వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. పసుపు బోర్డులో అందరికీ అవకాశం ఇవ్వాలని, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతుల కోసం పని చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
Telangana: కవిత గతంలో బతుకమ్మ, తర్వాత జాగృతి ఇప్పుడు బీసీ నినాదం అందుకున్నారని మంత్రి పొన్నం వ్యాఖ్యలు చేశారు. కొందరికి అధికారం మత్తు దిగి మస్తు గుర్తుకొస్తాయంటూ సెటైర్ విసిరారు. బీఆర్ఎస్ తమ పార్టీ పదవుల్లో బీసీలకు అవకాశమివ్వాలన్నారు. పార్టీ ఓనర్లలో తాను ఒకడిని అని ఈటెల రాజేందర్ అన్నందుకు మెడలు పట్టి బయటకి పంపారని విమర్శించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
MLC KAVITHA: మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం.. గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన వారు కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
BANDI SANJAY: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.