• Home » Mizoram

Mizoram

Assembly elections: ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని స్థానాలకంటే..?

Assembly elections: ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని స్థానాలకంటే..?

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఓటర్లు నేడు ఓటు వేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ మొదలైంది.

Assembly polls: పోలింగ్‌కు సిద్ధమైన మిజోరం, ఛత్తీస్‌గఢ్ ఫేజ్-1

Assembly polls: పోలింగ్‌కు సిద్ధమైన మిజోరం, ఛత్తీస్‌గఢ్ ఫేజ్-1

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఛత్తీస్‌గఢ్ లో తొలి విడత పోలింగ్‌, మిజోరంలో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది.

Modi campaign cancel: మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమం రద్దు

Modi campaign cancel: మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమం రద్దు

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మిజోరంలోని మమిత్ లో అక్టోబర్ 30న జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయింది. మోదీకి బదులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మమిత్‌లో ప్రచారం చేపడతారని పార్టీ ప్రతినిధి తెలిపారు.

Mizoram: గిరిజన భూములు, అడవుల రక్షణకు బిల్లు తెస్తాం... కాంగ్రెస్ కీలక హామీ

Mizoram: గిరిజన భూములు, అడవుల రక్షణకు బిల్లు తెస్తాం... కాంగ్రెస్ కీలక హామీ

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక హామీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే గిరిజన భూములు, అటవీ ప్రాంతాలు, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని హామీ ఇచ్చింది.

Mizoram elections: 173 నామినేషన్ల చెల్లుబాటు, పెండింగ్‌లో ఒక నామినేషన్

Mizoram elections: 173 నామినేషన్ల చెల్లుబాటు, పెండింగ్‌లో ఒక నామినేషన్

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలైన 174 నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల కమిషన్ 173 నామినేషన్లు చెల్లుబాటును ధ్రువీకరించింది. విపక్ష పార్టీ జేపీఎం అభ్యర్థి డాక్టర్ లొర్రయిన్ లాల్‌పెక్లియాన్ నామినేషన్‌లో కొన్ని తేడాలు కనిపించినందున పునఃపరిశీలన చేస్తున్నట్టు కమిషన్ అధికారులు తెలిపారు.

Mizoram elctions: 40 సీట్లకు  40 మంది స్టార్ క్యాంపెయినర్లు

Mizoram elctions: 40 సీట్లకు 40 మంది స్టార్ క్యాంపెయినర్లు

ఎన్నికలు చిన్నవైనా పెద్దవైనా తమ పోటీ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పే బీజేపీ ఈసారి మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా సీరియస్‌గానే తీసుకుంది. 40 మంది అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందిని శుక్రవారంనాడు ప్రకటించింది.

Mizoram: స్కూటీపై ప్రయాణించిన రాహుల్

Mizoram: స్కూటీపై ప్రయాణించిన రాహుల్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిజోరంలో రెండో రోజు పర్యటిస్తున్న కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారంనాడు ఒక స్కూటీపై ఐజ్వాల్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు బయలుదేరిన రాహుల్ ఒక స్కూటర్ వెనకాల హెల్మెట్ ధరించి కూర్చుని ప్రయణం సాగించారు.

Mizoram elections: 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా

Mizoram elections: 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా

మిజోరం అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే 39 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్‌సవతా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మిజోరంలో రాహుల్ గాంధీ పర్యటన వేళ రాష్ట్ర కాంగ్రెస్ ఈ జాబితాను విడుదల చేసింది.

Mizoram Election 2023: ఎంఎన్ఎఫ్‌కు 25 నుంచి 35 సీట్లు ఖాయం: జోరంతంగా

Mizoram Election 2023: ఎంఎన్ఎఫ్‌కు 25 నుంచి 35 సీట్లు ఖాయం: జోరంతంగా

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ 25 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.

Kiren Rijiju: కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ.. ఇతర నేతలకు కూడా!

Kiren Rijiju: కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ.. ఇతర నేతలకు కూడా!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి