Home » Minister Narayana
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. రెండో రోజు సోమవారం మంత్రి బృందం పర్యటన కొనసాగుతోంది.
మంత్రివర్యులు నారాయణ బృందం గుజరాత్లో పర్యటించి, సర్ధార్ పటేల్ విగ్రహం, గిఫ్ట్ సిటీ, సబర్మతి రివర్ ఫ్రంట్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. అమరావతిలో భారీ విగ్రహాలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం గుజరాత్ ఆధారంగా అధ్యయనం చేస్తున్నారు
మంత్రి నారాయణ ఆది, సోమవారాల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. మంత్రితో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.
అమరావతి నిర్మాణానికి సంబంధించి గుజరాత్లోని పలు ప్రాంతాలను మంత్రి నారాయణ బృందం పరిశీలించనుంది. బృందం సర్ధార్ వల్లభాయ్పటేల్ విగ్రహం, గిఫ్ట్సిటీ, సబర్మతి రివర్ఫ్రంట్ను సందర్శించనుంది,
Minister Narayana: ఏపీవ్యాప్తంగా స్వచ్చాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇ - వేస్ట్ సేకరణ భారీగా చేయాలని సూచించారు.
ఈనెల 19న 'ఇ-చెక్' థీమ్తో స్వచ్ఛాంధ్ర దినోత్సవం నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు
Amaravati Development Plan: రాజధానికి భూములిచ్చిన రైతులు అపోహ పడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో మూడేళ్లలో అమరావతి నిర్మణాన్ని పూర్తి చేస్తామన్నారు.
Narayana: గత జగన్ ప్రభుత్వం రాజధానిన అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. . రైతులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Minister Narayana: డ్రైయిన్లు పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Minister Narayana: డ్వాక్రా గ్రూపులతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు చేయాలన్నా డేటా పర్ఫెక్ట్గా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు.