Home » Minister Narayana
Andhrapradesh: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగ్ నగర్లో వరద ముంపు తగ్గిందన్నారు. నాలుగైదు డివిజన్లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉందన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని.. ఒక వైపు నీరు నిలవడంతో మోటార్లతో కాలువలకు మళ్లించామని చెప్పారు.
విజయవాడ: ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న - నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది.
పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు(సోమవారం) పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ప్రహహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రజలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
హైడ్రా తరహా సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేస్తే తరువాత పరిణామాలు ఎలా ఉండవచ్చనే చర్చ మొదలైంది. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాచేసి నిషేధిత ప్రాంతంలో నిర్మించిన కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో..
ఆంధ్రప్రదేశ్లో అనధికార లే అవుట్లపై మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టింది. అనుమతులు లేని లే అవుట్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
ప్రజలకు క్యాన్సర్పై అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
వైసీపీ(YSRCP) హయాంలో తీవ్ర స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ(Minister Narayana) ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.