• Home » Minister Narayana

Minister Narayana

 Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం

రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

Telangana: అనిల్ కుమార్ యాదవ్ ఒక ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్ అంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారాయణ మీద పెట్టిన కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్నారు. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారన్నారు.

 Minister Narayana: అమరావతికి భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ

Minister Narayana: అమరావతికి భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ ఉండనున్నారు. భూములు ఇవ్వడానికి ముందుకువస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు.

Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు

Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు

Andhrapradesh: రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు.

Minister Narayana: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి దిగిన మంత్రి నారాయణ

Minister Narayana: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి దిగిన మంత్రి నారాయణ

రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములిచ్చేందుకు రైతులుముందుకొస్తున్నారు.

Minister Narayana: చంద్రబాబు పాలనపై  వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ధ్వజం

Minister Narayana: చంద్రబాబు పాలనపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ధ్వజం

విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని మంత్రి నారాయణ తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. ఈవిషయంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని మంత్రి నారాయణ అన్నారు.

Minister Narayana: బుడమేరుపై పుకార్లు సృష్టిస్తున్నారు

Minister Narayana: బుడమేరుపై పుకార్లు సృష్టిస్తున్నారు

విజయవాడలోని నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. న్యూ ఆర్.ఆర్.పేట,జక్కంపూడి సింగ్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తోందని కాసేపటి క్రితం నుంచి ప్రచారం జరుగుతోందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

 Vijayawada: వరద నీటి పంపింగ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ..

Vijayawada: వరద నీటి పంపింగ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ..

విజయవాడ: నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్‌లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్‌తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.

Minister Narayana: శానిటేషన్‌పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Minister Narayana: శానిటేషన్‌పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన శానిటేషన్‌ పనులపై సంబంధిత అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ ఈరోజు(గురువారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Minister Narayana: బుడమేరు ఆక్రమణల తొలగింపుపై సీఎం ఆదేశాలిచ్చారు

Minister Narayana: బుడమేరు ఆక్రమణల తొలగింపుపై సీఎం ఆదేశాలిచ్చారు

Andhrapradesh: బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగు ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి